అధిక పాల ఉత్పత్తి చేస్తున్న పాడి రైతులకు,ఘనంగా సన్మానం.
రుద్రవరం మండలం ముత్తలూరు గ్రామం పరిధిలో గల పాడిరైతులతో హెరిటేజ్ సంస్థ రీజనల్ హెడ్ శ్రీ నాగప్ప రావు, ఏరియా మేనేజర్ నారాయణ రెడ్డీ గారు, సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం పాడి రైతులకు సన్మానం చేశారు. వారు మాట్లాడుతూ పాడి పరిశ్రమ వ్యవసాయానికి ప్రత్యామ్నాయ రంగం అని, ప్రస్తుతం వ్యవసాయ రంగం లో నష్టాలు చవిచూసిన వారు పాడి పరిశ్రమ ద్వారా లాభాలు ఆర్జిస్తున్నారని అన్నారు. రైతుకు నేరుగా ఖాతాల్లో వారి సొమ్మును చేరేలా చేస్తున్నామని దీని వలన దళారి వ్యవస్థ ను రూపుమాపడానికి హెరిటేజ్ సంస్థ చిత్తశుద్ధితో ఉందన్నారు. ముత్తలూరు గ్రామం లోని HPC సెంటరు nandu హెరిటేజ్ సంస్థకు పాలను పంపిస్తున్న రైతులలో అధిక ఉత్పత్తి చేసిన రైతులు పాపయ్య , ఆది నరసింహుడు, సుబ్రమణ్యం లకు మెమెంటో అందచేసి సన్మానించారు. ప్రస్తుతం మార్కెట్లో ప్రభుత్వ డెయిరీ ల ఇచ్చే ధరతో పోలిస్తే హెరిటేజ్ సంస్థ 8 రూ.. అధికంగ ఇస్తుందన్నారు . పాల ఉత్పత్తి చేస్తున్న రైతులు విరివిగా దానా, కాల్షియం వంటివి వాడటమే కాకుండా సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు, చికిత్స అందించాలి అనే విషయాలను వివరించారు. ఈ సందర్బం గా హెరిటేజ్ సంస్థ అధికారులను పాడిపరిశ్రమ రైతులు ధన్యవాదములు తెలియచేసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో మల్లిఖార్జున రావు బనగానపల్లె, మేనేజర్, శివారెడ్డి అయ్యలూరు మెట్ట మేనేజర్, ముత్తలూరు గ్రామం పాడిపరిశ్రమ రైతులు పాల్గొన్నారు.