logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తాళాలు వేసిన ఇల్లు, గుళ్ళు, మోటార్ సైకిళ్ళు మరియు పొట్టేళ్లు దొంగతనం చేసిన నలుగురు వ్యక్తులు అరెస్ట్ : డి.ఎస్.పి డేగల ప్రభాకర్

చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం వీకోట మండలంలో గత కొద్దిరోజులుగా తాళాలు వేసిన ఇల్లు , గుళ్ళు,మోటార్ సైకిళ్ళు మరియు పొట్టేళ్లు దొంగతనాలు జరుగుతున్నాయన్న సమాచారంతో చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి IPS ఆదేశాల మేరకు డీఎస్పీ డేగల ప్రభాకర్ ఉత్తర్వుల మేరకు వి కోట అర్బన్ పోలీస్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ రెడ్డి మరియు వారి సిబ్బందిని రెండు టీములుగా విభజించి సాంకేతిక నైపుణ్యం ఆధారంతో సిబ్బందితో కలిసి నాయక నేరీ చెక్పోస్ట్ వద్ద వీకోట ప్యార్నంబట్ రోడ్డు లో వాహనాలను తనిఖీ చేస్తుండగా అంతలో వీకోట వైపు నుండి ఒక టయోటా ఇతియోస్ కారు లో నలుగురు వ్యక్తులు పెర్ణంబట్ వైపుకు వస్తూ పోలీసులను చూసి వెనుకకు కు తిప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని చాకచక్కగా పట్టుకున్నారు. విచారించగా కారులో 46 గ్రాముల బంగారు ఆభరణాలు, 519 గ్రాముల వెండి వస్తువులు మరియు పంచలోహ కవచం, నంది విగ్రహంను స్వాధీనం చేసుకోవడం అయినది. దొంగలు పాత నేరస్తులు గానే గుర్తించారు. వీరు దొంగలించిన సొత్తు విలువ సుమారు 12 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి ముద్దాయిలను కోర్టుకు హాజరపరచడమైనదని డిఎస్పి డేగల ప్రభాకర్ తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రైమ్ సిబ్బందికి రివార్డు కోసం చిత్తూరు జిల్లా ఎస్పీకి సిఫార్సు చేయడం అయినదని తెలిపారు.

81
4767 views

Comment