సాలూరు టౌన్ లో భారత రాజ్యాంగ శిల్పికి ఘన నివాళులు అర్పించిన జనసేన 5 వ వార్డ్ కౌన్సిలర్ ప్రతినిధి గుమ్మా నాగార్జున
పార్వతిపురం మన్యం జిల్లా,
సాలూరు టౌన్ 5వ వార్డ్ రేల్లి వీధిలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్ లో జన్మించారు ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఎక్సైజ్ ఎస్పీ చింతగడ దాసు, నాలుగో వార్డ్ మాజీ కౌన్సిలర్ గొల్లపల్లి వరప్రసాద్, ప్రసాద్, మోయి చిన్న ,నిమ్మకాయల విజయ్ కుమార్ ,నిమ్మకాయల శ్రీను, వడ్డాది ప్రకాష్ రావు హాజరయ్యారు. 5వ వార్డ్ మాజీ కౌన్సిలర్ , సాలూరు పట్టణ ఐదో వార్డ్ జనసేన కౌన్సిలర్ ప్రతినిధి గుమ్మా నాగార్జున, 4వ వార్డ్ కౌన్సిలర్ గొల్లపల్లి వరప్రసాద్, నిమ్మకాయలు విజయ్ కుమార్ ఇతరులు 5వ వార్డు లో వీధి ప్రజల సౌకర్యార్థం కల్యాణ మండపం నిర్మించేందుకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.