logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

హైవేలను నిర్లక్ష్యం చేస్తున్న ప్రజలు 🚫 పశువులు, రీల్స్, స్టంట్స్‌తో పెరుగుతున్న ప్రమాదాలు 📍 (ప్రత్యేక ప్రతినిధి) హైవేలు, ఎక్స్ప్రెస్ హైవేలపై

నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ ప్రజలు పట్టించుకోవడం లేదు. రోడ్డుపై పశువులను వదిలేయడం, బైక్ స్టంట్స్ చేయడం, రీల్స్ కోసం రోడ్ల మధ్యలో వీడియోలు తీయడం వంటి చర్యలు ప్రమాదాలకు దారి తీస్తున్నాయి.
ప్రత్యేకంగా రాత్రి వేళల్లో పశువులు రోడ్డుపైకి రావడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అలాగే సోషల్ మీడియా కోసం యువత రిస్కీ స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి.
పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా, కఠిన చర్యలు తీసుకున్నా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. ప్రజలు తమ భద్రతపై అవగాహన పెంచుకుని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు.
👉 “రీల్ కోసం ప్రాణాలు పణంగా పెట్టొద్దు” అని ట్రాఫిక్ అధికారులు హెచ్చరిస్తున్నారు.

3
230 views

Comment