దివంగత ఎన్టీఆర్ కు ఘన నివాళులు
తెలుగు జాతి వాడి,వేడి యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని పార్వతీపురం మన్యం జిల్లా నాగవంశం అధ్యక్షుడు తెలికాపు ఉమామహేశ్వరరావు కొనియాడారు. ఎన్టీఆర్ 103 వ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ పెట్టిన 9 నెలలకే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ సీఎం అయ్యారు. సంచలనం సృష్టించిన కారణజన్ముడు అని అన్నారు. సాలూరు టిడిపి మహానాడు సందర్భంగా మంత్రి సంధ్యారాణి క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ కు తెలికాపు ఉమామహేష్ ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం సింహాచలం తో పాటు అధిక సంఖ్యలో టిడిపి నేతలు పాల్గొన్నారు.