logo

కష్టపడి చదివే విద్యార్థుల కష్టం ఎక్కడికి పోదు పేద విద్యార్థుల ప్రతిభకు కొత్తగూడెం ప్రాఫిట్ షూ కంపెనీ ప్రోత్సాహ పురస్కారాలు




ప్రభుత్వ పాఠశాలలో మెరిసిన మట్టిలో మాణిక్యాలు
బాగా చదవాలి తల్లిదండ్రులకు అలాగే వారి ఉపాధ్యాయులకు
మంచి పేరు తేవాలి

ఈ కార్యక్రమాన్ని కి ముఖ్య అతిథిగా వచ్చిన కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐ ఎస్.కె మాధవ్ గారు మాట్లాడుతూ విద్య సమాజ మార్పుకు నాంది అని, పేదరికాన్ని జయించి ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించటం ద్వారా మన జీవితాల్లో మార్పు వస్తుందని, విద్యార్థులు బాగా చదువుకునే ఉన్నత స్థితికి ఇచ్చారా అని కోరారు.
అలాగే సమాజంలో విద్యను అందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేశారు.
అలాగే సమాజ సేవలో తన వంతు బాధ్యతగా ఇంత చక్కని కార్యక్రమం ద్వారా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ప్రాఫిట్ షూ కంపెని అధినేత శ్రీ బి.ఎస్. కోటేశ్వరరావు గారికి, ప్రాఫిట్ సంస్థకు, సిబ్బందికి, కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతిలో అత్యధిక మార్పు సాధించిన బూడిది గడ్డ గౌడ్ స్కూల్ విద్యార్థిని దొడ్డ శ్రీ వర్ష s/o రమేష్ 531/600
హెచ్ఎం మేడం బూరుగు మధురవాణి

గూడూరి బేబీ ప్రసన్న s/o లక్ష్మణరావు 529/600 తెలంగాణ పబ్లిక్ స్కూల్ పాత కొత్తగూడెం
హెచ్ఎం మేడం గుబులాపురం లక్ష్మీ గారు.

ఈ సభ ఉద్దేశించి స్టోర్ మేనేజర్ గారు పర్వతం సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రాఫిట్ షూ కంపెని వ్యాపారంతో పాటుగా తన కర్తవ్యం గా సమాజసేవ కార్యక్రమాలను నిత్యం నిర్వహిస్తూ ఉంటుందని,ఈ సమాజ సేవా కార్యక్రమాలలో భాగంగా ఈ సంవత్సరం 2024- 2025 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం పాఠశాలలో చదివిన ప్రధమ మరియు ద్వితీయ స్థానాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను వారి ప్రతిభను గుర్తించి ప్రాఫిట్ షూ కంపెనీ అధినేత మానేజింగ్ డైరెక్టర్ శ్రీ. బి. ఎస్. కోటేశ్వరరావు గారు తెలుగు రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో అన్ని బ్రాంచ్ లలో ప్రభుత్వ పాఠశాలలో చదివి విజయం సాధించిన విద్యార్థులను అభినందిస్తూ ఆత్మీయ సత్కార కార్యక్రమాలను ఏర్పాటు చేసి విద్యార్థులను విద్య ద్వారా పై స్థాయికి వెళ్లే విధంగా ప్రోత్సహించడం జరుగుతుంది.

38
4356 views