ఆశా కార్యకర్త పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎవరు ఎటువంటి ప్రలోభాలకు లోంగవద్దు మోసపూరితమైన వ్యక్తుల మాటలు నమ్మవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రతినిధి, జూన్ 28 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)ఎన్టీఆర్ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఈనెల 25వ తేదీన ఆశా కార్యకర్తల నియామకంపై వెలువడిన నోటిఫికేషన్ అనుసరించి జిల్లాలో వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ఇతర మాధ్యమాల ద్వారా ఆశా కార్యకర్తల పోస్టులు కొందరు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసి మోసపూరితమైన చర్యలకు పాల్పడుతున్నట్లు మా దృష్టికి వచ్చిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఇచ్చిన సంయుక్త పత్రిక ప్రకటనలో భాగంగా ఆశా కార్యకర్త పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎవరు ఎటువంటి ప్రలోభాలకు లోంగ వద్దని అదేవిధంగా మోసపూరితమైన వ్యక్తుల మాటలు నమ్మవద్దని ఆశా కార్యకర్తల నియామకం కమ్మ్యూనిటీ ప్రాసెస్ మార్గదర్శకాల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ఆరోగ్యశాఖలు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారమే నియామక ప్రక్రియ నడుస్తోంది. జిల్లా హెల్త్ సొసైటీ ద్వారా పూర్తిగా మెరిట్ ఆధారంగా నియామకాలు జరుగుతాయని అర్హతలు అనుసరించి అభ్యర్థులు ఎంపిక జరుగుతుందని తెలియజేస్తూ ఒక ప్రకటనలో తెలియజేయడమైనది.