logo

దేవినేని ఉమామహేశ్వర రావు తెదేపా నేత, మాజీ మంత్రి

ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి ప్రతినిధి, జూన్ 28 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)

అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో జైల్లో పెడతామని సజ్జల పిచ్చి ప్రేలాపనలు మాట్లాడుతున్నాడు. పేకల్లోతు అవినీతిలో కూరుకుపోయి పార్టీ వైసీపీ సింగయ్యను కారు టైరుతో తొక్కించి కనీస పశ్చాతాపం లేకుండా బాధ్యత వహించకుండా అబద్దాలతో విషం చిమ్ముతున్నారు.
విగ్రహాలు ప్రారంభం చేయాలనే యావలో జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే సజ్జల సమర్ధించుకుంటూ మాట్లాడుతున్నారు.
జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో సజ్జల రామకృష్ణారెడ్డి, వై వి సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు, వైసిపి దుర్మార్గులు అందరూ కట్టుకథలు అల్లుతున్నారు.
కంటైనర్ల, కంటైనర్ల తో జగన్మోహన్ రెడ్డి దోచుకున్న వేలకోట్లు కక్కించడానికి కూటమి యంత్రాంగం సిద్ధంగా ఉంది. పోలీసుల ముందు దోషిగా నిలబడి జైలుకు వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
సజ్జల..! సొల్లు కబుర్లు కట్టిపెట్టి వైసీపీ దుకాణం సర్దుకోండి
38 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కోర్టు మెట్లు ఎక్కి సమాధానం చెప్పి వాయిదాలకు రావాల్సిందే.
వాస్తవాలకు సమాధానం చెప్పలేక కూటమి ప్రభుత్వంపై బురద జల్లి అసత్యాలు, అబద్ధాలు సాక్షి పత్రికలో వండివారుస్తున్నారు.
జగన్ అవినీతి పై సమాధానం చెప్పాల్సి వస్తుందనే శాసనసభకు కూడా వెళ్లడం లేదు.ఎంతమంది బిడ్డలు ఉన్నా తల్లికి వందనం పథకం అమలు చేశారు.ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లుఅందిస్తున్నారు, త్వరలోనే అన్నదాత సుఖీభవ రైతుల ఎకౌంట్లో జమ అవుతుంది. మూడువేల కోట్ల బకాయిలు పెట్టిన జగన్ కు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.సూపర్ సిక్స్ హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పారదర్శక పాలనతో ఏడాది పూర్తి చేసుకుని అభివృద్ధి, సంక్షేమం వైపు ఉరకలు వేస్తుంది. ఏడాదిలో రాష్ట్ర ప్రజలకు అందించిన సంక్షేమంతోపాటు రాబోవు నాలుగేళ్లలో రాష్ర్టాభివృద్ధి కోసం అమలు చేయాల్సిన ప్రణాళికలు, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.

0
0 views