మీ పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్పించండి
ఇంటింటా సర్కార్ సార్ల ప్రచారం
మీ పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్పించండి
ఇంటింటా సర్కార్ సార్ల ప్రచారం
మీ పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్పించండి
ఇంటింటా సర్కార్ సార్ల ప్రచారం
బుగ్గారం / జగిత్యాల జిల్లా:
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల బృందం శనివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు అన్నాడి మోహన్ రెడ్డి, స్కూల్ అసిస్టెంట్ టీచర్లు జనమంచి శ్రీనివాస్, గందె మనోహర్, రికార్డ్ అసిస్టెంట్ చీటి నాగరాజు తదితరులు బుగ్గారం గ్రామంలో పిల్లలను సర్కార్ బడిలో చేర్పించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రజా కూడలి ప్రదేశాల్లో ప్రముఖులకు, గ్రామ పెద్దలకు వారు కర పత్రాలు పంపిణీ చేశారు. ఇక్కడ ఉన్నది మీ బడి, ఆది మీ పిల్లల కోసమే.... దాని అభివృద్ధి, పిల్లలను చేర్చడం మీ బాధ్యత. వారిని చక్కదిద్ది మంచి విద్యా బోధన చేయడం - వారిని సన్మార్గంలో నడిచేందుకు తగు ప్రత్యేక శిక్షణ అందించడం మా కర్తవ్యం అంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రచారం చేశారు.
మీ పిల్లల ఉజ్వల భవిష్యత్ కై ఎలాంటి ఫీజులు, ఎలాంటి ఖర్చులు లేని సర్కార్ పాఠశాలలో చేర్పించాలని వారు కోరారు. ప్రత్యేకంగా ముద్రించిన కరపత్రం ఇంటింటా పంపిణీ చేస్తూ గత పరీక్షల ఫలితాలలో పదవతరగతి పిల్లలు సాధించిన ఉత్తమ ఫలితాలను వారు నిదర్శనంగా వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ పాఠశాలలలో చదివే విద్యార్థినీ - విద్యార్థులకు ప్రతి రోజూ శుచి - రుచి కరమైన వంటకాలతో ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తుందన్నారు. అనుభవజ్ఞులైన ఉన్నత విద్యార్హతలు, శిక్షణ కలిగిన ఉపాధ్యాయుల చే విద్యా బోధన, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, డిజిటల్ సాధనాల ద్వారా విద్యా బోధన, క్రీడలు, సాంస్కృతిక, కళా రంగాలలో, కరాటే లో ఉచిత శిక్షణ, ప్రతి నెల తల్లిదండ్రులు - ఉపాధ్యాయులతో సమావేశం, మెరుగైన ఫలితాల సాధన కోసం అందించే విద్యకై విశ్లేషణాత్మక నివేదిక, ఉచిత పాఠ్య, నోట్ పుస్తకాలు, రెండు జతల దుస్తులు, అర్హులైన వారికి ఉపకార వేతనాలు, తదితర ముఖ్యమైన విషయాలను వారు గ్రామ ప్రజలకు కండ్లకు కట్టినట్లు వివరించారు. పలువురు ప్రముఖులు, గ్రామస్తులు ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రచారాన్ని అభినందించారు. ప్రత్యేకంగా వారికి శుభాబి వందనాలు తెలియజేశారు.
Read More
|